Harish Rao: ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉంది.. రూ.కోటి పరిహారం అందించాల్సిందే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: పాశమైలారం పరిశ్రమ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు.
Read Also:Reactor Blast: భారీ క్రేన్ లతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
Also Read
- RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- India-Iran: హార్ముజ్లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
- IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్పై నాన్-బెయిలబుల్ వారెంట్..
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి ఐదు గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 150 మంది వరకు కార్మికులు ఉన్నారని, అయితే ఇప్పటివరకు 60 మంది ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అస్పత్రిలో 11 మంది గాయపడినవారు చికిత్స పొందుతుండగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని.. దీనికోసం జిల్లాకు చెందిన ఎస్పీ, కలెక్టర్ లను ఫోన్ ద్వారా సంప్రదించి.. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Read Also:Chirag Paswan: బీహార్ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
అంతేకాకుండా, ఈ ఘటనలో మరణించిన కార్మిక కుటుంబాలకు తక్షణమే రూ. కోటి ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వంను ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు తమ బంధువుల ఆచూకీ లేక ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
-
India-Iran: హార్ముజ్లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
-
Zareen Khan: హద్దు దాటిన ఫోటోగ్రాఫర్.. ఇచ్చిపడేసిన హీరోయిన్! వీడియో వైరల్..
-
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
-
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!