Reactor Blast: భారీ క్రేన్ లతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Read Also:Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఉదయం 9 గంటల సమయంలో పరిశ్రమలో పని సాగుతున్న సమయంలోనే రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో కంపెనీకి చెందిన షెడ్, గ్రౌండ్ +2 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. రెండో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది పేలుడుతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ చుట్టుపక్కల ఉన్న 8 మంది సజీవ సమాధి అవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు.
Read Also:Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!
ప్రస్తుతం మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ క్రేన్లు, హైడ్రాలిక్ పరికరాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. మరో 3 గంటల్లో శిథిలాల తొలగింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరొకసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..