Harish Rao : రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం : మాజీ మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని తెలుస్తున్నది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందన్నారు.
అంతేకాకుండా..’అంబర్పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే, ఆరు నెలల క్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘోర నేరాలకు ఇప్పటికీ న్యాయం దక్కకపోవడం శోచనీయం. తెలంగాణలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదు . రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31%గా ఉంది, ఇది బీహార్లో లాంటి రాష్ట్రాలతో పోటీపడి పరిస్థితి ఏర్పడింది.
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఘటన జరిగిన మొదటి వారం గోల్డెన్ పీరియడ్గా భావించబడుతున్నది . అయితే, ఆ సమయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదు, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని,శక్తిని కోల్పోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం.
మరోవైపు, ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడడం దుర్మార్గం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారు.
ఆఖరికి పేరు మర్చిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం ల్యాండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీస్ శాఖను వాడితే బాగుంటుంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి మెరుగైన లా అండ్ ఆర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీస్ శాఖ బడ్జెట్ విడుదల చేసి పోలీస్ బలగా బలోపేతం చేయాలి. చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలి వేగవంతమైన న్యాయాన్ని అందించాలి కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించకూడదు.’ అని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!