Harish Rao : రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం : మాజీ మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని తెలుస్తున్నది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందన్నారు.
అంతేకాకుండా..’అంబర్పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే, ఆరు నెలల క్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘోర నేరాలకు ఇప్పటికీ న్యాయం దక్కకపోవడం శోచనీయం. తెలంగాణలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదు . రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31%గా ఉంది, ఇది బీహార్లో లాంటి రాష్ట్రాలతో పోటీపడి పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
ఘటన జరిగిన మొదటి వారం గోల్డెన్ పీరియడ్గా భావించబడుతున్నది . అయితే, ఆ సమయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదు, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని,శక్తిని కోల్పోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం.
మరోవైపు, ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడడం దుర్మార్గం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారు.
ఆఖరికి పేరు మర్చిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం ల్యాండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీస్ శాఖను వాడితే బాగుంటుంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి మెరుగైన లా అండ్ ఆర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీస్ శాఖ బడ్జెట్ విడుదల చేసి పోలీస్ బలగా బలోపేతం చేయాలి. చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలి వేగవంతమైన న్యాయాన్ని అందించాలి కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించకూడదు.’ అని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!