Harish Rao : సర్పంచ్లకు శుభవార్త చెబుతున్నాం.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి కులబ్ గుర్ లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయన్నారు. నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారని, 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట.. బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి అని ఆయన వివరించారు. మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుంది…ఇది తెలంగాణ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తున్నారు..బీజేపీ వాళ్ళు 10 వేలు సరిపోవు అంటున్నారని, ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.. మీరో 10 వేలు ఇవ్వండి ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దామన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ.. మోటర్లకు మీటర్లు పెట్టింది బీజేపీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బిజెపి వాళ్ళు అడుగుతున్నారు…ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సంసద్ యోజన లో 10 కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని, సర్పంచ్ లకు శుభవార్త చెబుతున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో వేస్తామని ఆయన తెలిపారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామని, గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని… బావులను తవ్వుడే పని అని, ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుంది.. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!