Harish Rao: ప్రభుత్వం ఏర్పడలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదని హరీష్ రావు అన్నారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి..
Also Read
- బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
- India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
బీఆర్ఎస్ అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తామెప్పుడు ప్రజల పక్షమేనని హరీష్ రావు తెలిపారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో తాము ఓడిపోయామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుదాం.. తప్పు ఒప్పులు సరి చేసుకుందామని చెప్పారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా.. సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని పేర్కొన్నారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా.. ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హరీష్ రావు చెప్పారు.
YV Subba Reddy: వైసీపీలో చాలా మార్పులు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని హరీష్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని తెలిపారు. 14 ఏళ్ళు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నామన్నారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్సేనని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల కోసం కొట్లాడుదాం.. భవిష్యత్తు మనకే ఉంటుంది.. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. అందరం కలసి పని చేద్దామని తెలిపారు.
తాజావార్తలు
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
West Bengal: “వాడికి ఇదే సరైన శిక్ష”.. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్కు జూలై 10న పండగే!
-
Samsung Galaxy Unpacked 2026: సామ్ సంగ్ ఫోల్డబుల్ 5G ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ డేట్ ఫిక్స్..!
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!