Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Criticizes Congress Over Farmers Issues Telangana

Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది

Published Date :January 1, 2025 , 4:54 pm
By Gogikar Sai Krishna
  • విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారు
  • రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారు
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారు :హరీష్‌ రావు
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్‌ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తుందని, రైతులు మళ్ళీ పైరవికారులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని హరీష్‌ రావు విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగుటింగు మని రైతు బంధు వచ్చేదని, ఇప్పుడైతే 10 వేలు మేమోస్తే 15 వేలు అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు హరీష్‌ రావు.

అంతేకాకుండా..’కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి కొన్ని వార్తలు రాయిస్తుంది.. పంట పండించే భూములకు రైతు భరోసా ఇస్తామంటున్నారు.. దీనివల్ల పండ్ల తోటలు, ఆయిల్ పామ్, చెరుకు రైతులు నష్టపోతారు.. కొండలు గుట్టలు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వమని అంటున్నారు.. కొండల్లో, గుట్టలో దళిత గిరిజనులు భూములు సాగు చేస్తారు.. దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా.. అందరికి అన్నం పెట్టే రైతును అడుక్కుతినేలా చేయకండి.. 4 తేదీన క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసింది.. ఒక వేళ ఒకే పంట పండించే భూముల రైతులకి రైతు భరోసా ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త.. జరగబోయే పర్యవసాలకు మీరే బాధ్యత వహించాలి.. 2 లక్షలు పైన రుణాలు ఉన్న రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో సీఎం చెప్పాలి.. సీఎం మాట నమ్మి 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు తెచ్చి కట్టి ఇంకా అప్పుల పాలయ్యాడు.. 2 లక్షల లోపు ఉన్న సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు.. 11 సార్లు కేసీఆర్ రైతుభందు ఇచ్చారు…రైతుల సమాచారం మొత్తం ఉన్న మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు..? తెలంగాణలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే ఒక కోటి 4 లక్షల మంది కూలిలు ఉన్నారు.

Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

దీంట్లో కూడా ఏరివేతలు మొదలుపెడుతుంది కాంగ్రెస్.. ఇది అన్యాయం.. మే నెలలో ఉపాధిహామీ పనులకు 850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయి.. ఈ డబ్బులు కూలీలకు ఇవ్వకుండా దారి మళ్లించింది కాంగ్రెస్.. మూడు నెలల్లో ఉపాధిహామీ డబ్బులు చెల్లించకపోతే వడ్డీతో సహా తిరిగి కేంద్రానికి చెల్లించాలి.. 7 నెలలు అయినా ఉపాధిహామీ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి.. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. కానీ ఏడాదిగా తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయి.. 23 శాతం నేరాలు పెరిగి తెలంగాణ ఎల్లో జోన్ లోకి వెళ్ళిపోయింది.. ఇలాగే పరిస్థితి ఉంటే ఇంకొన్ని రోజుల్లో రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది.. ఇలా అయితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావు.. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Highest Salary In The World: ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న భారతీయుడు.. రోజుకు 48 కోట్లు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Criticism
  • farmer welfare
  • harish rao
  • revanth reddy
  • Rythu Bandhu

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions