Harish Rao : శ్రీశైలం, నాగార్జున సాగర్లు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే నష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ చర్యను ప్రశ్నిస్తూ, తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, ఆంధ్రప్రదేశ్ లాభపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులను 2021 జూలైలో కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిందని, దానిని అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా వ్యతిరేకించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. “బదులుగా, మేము రెండు రాష్ట్రాలకు కృష్ణా నది నీటి కేటాయింపులో 50 శాతం డిమాండ్ మరియు శ్రీశైలం నుండి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం వంటి అనేక షరతులను ప్రతిపాదించాము. కానీ కేంద్రం వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు’’ అని అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ గిల్డీన్లను విడుదల చేయకుండా రెండు నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే తీవ్ర విద్యుత్ సంక్షోభం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని హరీశ్రావు హెచ్చరించారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి ఆయా ఆయకట్టుల పరిధిలోని వ్యవసాయ పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌజ్లను ఒకటి, ఆపివేయకుండా సమర్ధవంతమైన నీటి వినియోగం కోసం 24 గంటలూ ఆపరేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ దేనికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!