Harish Rao : శ్రీశైలం, నాగార్జున సాగర్లు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే నష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ చర్యను ప్రశ్నిస్తూ, తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, ఆంధ్రప్రదేశ్ లాభపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులను 2021 జూలైలో కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిందని, దానిని అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా వ్యతిరేకించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. “బదులుగా, మేము రెండు రాష్ట్రాలకు కృష్ణా నది నీటి కేటాయింపులో 50 శాతం డిమాండ్ మరియు శ్రీశైలం నుండి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం వంటి అనేక షరతులను ప్రతిపాదించాము. కానీ కేంద్రం వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు’’ అని అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ గిల్డీన్లను విడుదల చేయకుండా రెండు నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
- CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
- Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్ఘాట్లో సోనమ్ వాంగ్చుక్ నివాళి
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే తీవ్ర విద్యుత్ సంక్షోభం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని హరీశ్రావు హెచ్చరించారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి ఆయా ఆయకట్టుల పరిధిలోని వ్యవసాయ పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌజ్లను ఒకటి, ఆపివేయకుండా సమర్ధవంతమైన నీటి వినియోగం కోసం 24 గంటలూ ఆపరేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ దేనికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్ఘాట్లో సోనమ్ వాంగ్చుక్ నివాళి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!