Harish Rao : శ్రీశైలం, నాగార్జున సాగర్లు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే నష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ చర్యను ప్రశ్నిస్తూ, తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, ఆంధ్రప్రదేశ్ లాభపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులను 2021 జూలైలో కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిందని, దానిని అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా వ్యతిరేకించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. “బదులుగా, మేము రెండు రాష్ట్రాలకు కృష్ణా నది నీటి కేటాయింపులో 50 శాతం డిమాండ్ మరియు శ్రీశైలం నుండి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం వంటి అనేక షరతులను ప్రతిపాదించాము. కానీ కేంద్రం వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు’’ అని అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ గిల్డీన్లను విడుదల చేయకుండా రెండు నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే తీవ్ర విద్యుత్ సంక్షోభం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని హరీశ్రావు హెచ్చరించారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి ఆయా ఆయకట్టుల పరిధిలోని వ్యవసాయ పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌజ్లను ఒకటి, ఆపివేయకుండా సమర్ధవంతమైన నీటి వినియోగం కోసం 24 గంటలూ ఆపరేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ దేనికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?