IPL 2025: హార్దిక్ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి
- టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు
- ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా
- రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవాలన్న అజయ్ జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అవసరమైతే విడుదలైన తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు. కాగా.. సెప్టెంబర్ 28న ఐపీఎల్ రిటెన్షన్కు సంబంధించి కొత్త నిబంధనలు వచ్చాయి. ఇందులో ఆర్టీఎం కార్డ్లు ఉన్నవారితో సహా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
Grand Celebrations: తెలుగు హీరోయిన్కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. గ్రాండ్ సెలబ్రేషన్స్
Also Read
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
ముంబై ఇండియన్స్ వద్ద చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నందున కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని అజయ్ జడేజా సూచించారు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కొనసాగించాలని.. పాండ్యాను విడుదల చేయాలని తద్వారా వేలంలో తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు ఆటగాళ్లని ముంబై ఖచ్చితంగా రిటైన్ చేస్తుందని జడేజా అన్నారు. ఈ ఆటగాళ్లు వేలంలోకి వెళితే వారిని కొనడం అసాధ్యం.. ముంబై ఇండియన్స్ ఆర్టీఎం కార్డును హార్దిక్ పాండ్యా కోసం ఉపయోగిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
Rajnath Singh: భారత్తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
ఈసారి ఐపీఎల్లో కొత్త నిబంధన ఉంది. ఈ నిబంధనలో ఆర్టీఎం కార్డ్ అమలు తర్వాత.. ఇతర జట్లకు వేలం వేయడానికి మరొక అవకాశం లభిస్తుంది. తమ జట్టులో ఆడిన ఆటగాడు వేలంలో అందుబాటులో ఉంటే అతడిని తిరిగి పొందడానికి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటగాడు వేలంలో రూ. 16 కోట్ల ధర పలికాడని అనుకుందాం. వేలంలో ఏ జట్టు అతడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆర్టీఎం కార్డుని ఉపయోగించి పాత ఫ్రాంచైజీయే అతడిని దక్కించుకోవచ్చు. అంటే బిడ్డింగ్లో గరిష్ఠంగా ఎంత ధర పలికితే అంత ధరకు తిరిగి జట్టులోకి తీసుకోవడం అన్నమాట. ఈ ప్రక్రియలో ఆటగాళ్ల ధర పెరగవచ్చు లేదా తగ్గవొచ్చు. అవకాశాన్ని బట్టి పాత ఫ్రాంచైజీలే తిరిగి దక్కించుకునేందుకు వీలు కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..