Hanamkonda Crime: కూతురి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఫోన్ చేసి..!
- ధర్మసాగర్ మండలంలో దారుణం
- భర్తను హత్య చేసిన భార్య
- భర్తను చంపినట్లు పోలీసులకు చెప్పిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య హతమార్చింది. కూతురి సహాయంతో భర్త మెడకు చీర బిగించి హత్య చేసింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను చంపేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన అశోక్, యాదలక్ష్మిలు 14 ఏళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తూ.. వారానికి ఒకసారి అశోక్ ఇంటికి వెళ్లేవాడు. యాదలక్ష్మి పెద్దపెండ్యాలలో కూలీ పనులు చేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోంది. అశోక్ దసరా పండగ కోసం పెద్దపెండ్యాలలోని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో భార్య ప్రవర్తనతో అనుమానం వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి భార్యతో గొడవపడ్డాడు.
Also Read
Also Read: Maoist Asanna: ఇది లొంగుబాటు కాదు.. మావోయిస్టు అగ్రనేత ఆశన్న చివరి ప్రసంగం!
అప్పటినుంచి అశోక్ నిన్న మద్యం మత్తులో ఇంటికి వచ్చి యాదలక్ష్మితో గొడవ పడేవాడు. గత రాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు కూతురి సహాయంతో చీర బిగించి భార్య హత్య చేసింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను చంపేశానని సమాచారం ఇచ్చింది. మృతుడు అశోక్ తండ్రి వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ చెల్లెలు తన వదినపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభంశుభం తెలియని తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని, యాదలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!