KMM WIFE MURDER ATTEMPT: కట్టుకున్నోడు కాల్చేశాడు..
- కట్టుకున్నోడే కాల్చేశాడు..
- కన్నీరు పెట్టిస్తున్న ఖమ్మం ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KMM WIFE MURDER ATTEMPT: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. కొన్నేళ్లుగా అన్యోన్నంగా కాపురం చేస్తున్నారు. కానీ భర్తకు వచ్చి అనారోగ్యం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. వృద్ధాప్యంలో.. భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ భార్య. కానీ తన అనారోగ్యంతో నిత్యం జీవన్మరణ సమస్య కారణంగా ఆ భర్త ఎవరూ చేయని పని చేశాడు. కట్టుకున్న భార్యపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా తనువు చాలించాడు. అతను కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కానీ ఆ వృద్ధురాలు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తోటమల్ల నాగభూషణంది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఆయన స్వస్థలం. తిరుమలాయపాలెంలోనే భార్య జయమ్మతో కలిసి నివాసముంటున్నారు. నాగభూషణం సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారిద్దరిది అన్యోన్యమైన కాపురం. ఎన్నో ఏళ్ల నుంచి దాంపత్యం సాగిస్తున్నారు. కానీ ఇటీవల నాగభూషణంకు వచ్చిన అనారోగ్యం వారి కాపురంలో చిచ్చురేపింది.
Read Also: CM Revanth Reddy : హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
టీవల కొంతకాలం నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న నాగభూషణం.. ఆ బాధను భరించలేక పలుసార్లు ఆత్మాహత్యా ప్రయత్నం చేశాడు. అది గమనించిన భార్య జయమ్మ అతడిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించింది. అలా పలుమార్లు అడ్డుకుంది. ఆత్మహత్య చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవి. అంటే ఆమె తన భర్తపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతోంది. కానీ నాగభూషణం.. కిడ్నీ సమస్యతో సతమతమవుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. ఈ జీవితం నుంచి విముక్తి కావాలని అనుక్షణం కోరుకున్నాడు. కానీ భార్య తన మాట వినడం లేదని భావించాడు. ఆమె బతికి ఉన్నంత కాలం తనను ఆత్మహత్య చేసుకోనివ్వదని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రతిఘటిస్తున్న సమయంలో.. నాగభూషణం కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జయమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆమెని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాదాపు 60 నుంచి 70 శాతం కాలిన గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు నాగభూషణం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్ట్మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!