Moinabad Case: మొయినాబాద్ యువతి ఘటన.. ఎస్సైపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. సీఐ రాంబాబుకు మెమో జారీ చేశారు. యువతి మిస్సింగ్ మీద బాధితులు ఫిర్యాదు చేయటానికి రాగా.. ఎస్సై శివ నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. బాకరం గ్రామ పరిధిలో సోమవారం రోజు మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్గా (22) గుర్తించారు. సోమవారం (జనవరి 28)న ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
KTR: బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్తులోనూ ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
మృతురాలు చదువు పూర్తి కాగా ఉద్యోగం కోసం వెతుకుతుంది. అయితే.. గతంలో పలుమార్లు రెండు మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడేదని.. అలా రెండుమూడు రోజులు బయటే ఉండి వచ్చేదని అన్నారు. ఈసారి కూడా అలానే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
Tirumala: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం
ఇదిలా ఉంటే.. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు చేధించారు. ఈ ఘటన జరిగిన తరువాత అక్కడ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే.. ఒక ఆటో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ ను గుర్తించి విచారించారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా.. యువతి తనను డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపాలని అడిగిందని.. అందుకోసం వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి ఆటో ఎక్కినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తాను చెప్పినట్టుగా ఆ ప్రదేశంలో దింపి అక్కడి నుంచి వచ్చానని.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్య చేసుకునే ముందు రోజే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని తన ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టింది. ఆత్మహత్య చేసుకునే రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!