మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. సీఐ రాంబాబుకు మెమో జారీ చేశారు. యువతి మిస్సింగ్ మీద బాధితులు ఫిర్యాదు చేయటానికి రాగా.. ఎస్సై శివ నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. బాకరం గ్రామ పరిధిలో సోమవారం రోజు మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్య అని…