IPL 2025: ఎలిమినేటర్ ఆడితే.. టైటిల్ కష్టమా?
- రేపు ఎలిమినేటర్ మ్యాచ్
- ముంబై, గుజరాత్ మధ్య మ్యాచ్
- హై టెన్షన్ మ్యాచ్కి అంతా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
READ MORE: CM Revanth Reddy: ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొమ్మని మోడీకి చెప్పాం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
అంతకు ముందు, ఆ తర్వాత ఎలిమినేటర్ లో పాల్గొన్న ఏ జట్టు కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేదు. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ , గుజరాత్ లయన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ను ఓడించింది. ఆ తర్వాత క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ లయన్స్ను ఓడించి ఫైనల్స్కు చేరుకుంది. ఫైనల్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పోటీపడ్డాయి. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్రైజర్స్ టీం ఫైనల్లో ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఏ ఒక్క జట్టు కూడా ఛాంపియన్ కాలేదు.
READ MORE: Gadikota Srikanth Reddy: మీ రెడ్ బుక్ చూసి ఎవరూ భయపడటం లేదు..
మరి ఈ సారి ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడుతుందా? లేక పంజాబ్, ఆర్సీబీ జట్టులో ఎదో ఒకటి ఛాంపియన్ గా నిలుస్తుందా చూడాలి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో టాప్-2 జట్ల మధ్య మొదటి క్వాలిఫయర్ జరుగుతుంది. తర్వాత 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. మొదటి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. క్వాలిఫయర్-2 గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఏదేమైనా జూన్ 3న ఫైనల్లో తలపడే జట్టేదే రేపే తేలనుంది.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..