Gujarat: గుజరాత్లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: భారత్లో డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కోట్లలో వ్యాపారం చేస్తూ అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ పౌరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయినా వారి కళ్లు కప్పి డ్రగ్స్, మత్తుపదార్థాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.
తాజాగా, గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. పాకిస్తాన్ బోటులో అక్రమంగా తరలిస్తుండగా కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో కలిసి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో ఈ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్థాన్ పడవను అక్టోబర్ 8న పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 కిలోల హెరాయిన్ను కోస్ట్ గార్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
- Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Read Also: Book Fair in Hyderabad: బాక్స్ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్లో బుక్ ఫెయిర్ రేపటి వరకే
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటీఎస్ గుజరాత్తో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఈ ముఠా పట్టుబడింది. వాటితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. అంతకుముందు, సెప్టెంబర్ 14న, సుమారు రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ను పాకిస్తానీ బోటు నుంచి పట్టుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
-
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!