Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు
- వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధం..
- మంత్రి నారా లోకేష్ రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నాడు.
- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ గ్రామంలో తమ పార్టీకి పూర్తి మద్దతు ఉందని ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసం అని ఆయన ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాలు సాధించిందని వారు పేర్కొన్నారు. అలాగే, గత ఎన్నికల్లో టీడీపీకి 1350 ఓట్లు రాగా, వైఎస్ఆర్సీపీకి 150 ఓట్ల తేడా మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.
Also Read: Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్ స్టార్మర్ కౌంటర్..
Also Read
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
సభ్యత్వం నమోదు కోసం టీడీపీ నేతలు ప్రజల ఆధార్ కార్డులను తీసుకుని వారిని మోసం చేస్తున్నారని, పక్క రాష్ట్రాల వారికి కూడా టీడీపీ సభ్యత్వం కల్పించారని గుడివాడ అమర్నాథ్ ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలను బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ నాయకులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసారు.
Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనితపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ లేఖను అమ్మే స్థాయికి చేరుకున్న అనిత పేషీ, సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. టీటీడీ లడ్డు వివాదంపై పెద్ద ఎత్తున మాట్లాడిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసం పెంచాయని, భీమిలి నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!