Gudivada Amarnath : మొత్తం 7 స్థానాలు గెలిచి తీరుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటును వినియోగించుకున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే నలుగురు సభ్యులు మాత్రం టీడీపీకి ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు. కాగా, ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. మరోవైపు టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయితే అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డ మాట్లాడుతూ.. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారనేది పూర్తి అవాస్తవమన్నారు.
Also Read : Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. అసలు టీడీపీతో టచ్లో ఉండాల్సి అవసరం తమ పార్టీ నేతలకు లేదని, చంద్రబాబు ఏం చేసినా ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలు వైసీపీ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రచారం చేస్తోన్నట్లుగా తమ పార్టీలో అసంతృప్తులు లేరని క్లారిటీ ఇచ్చారు. అనంతరం హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీ తో టచ్ లో లేరన్నారు. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ అని ఆమె వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు అంటేనే టీడీపీకి సంఖ్యా బలం లేదని స్పష్టం అవుతోందని, ఏడు స్థానాలను వైసీపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..