GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాలకు పెరిగిన గిరాకీ.. ఒక్క రోజులో ఎన్ని కొన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త పన్ను విధానంతో ప్రజలకు ఊరట లభించింది. రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం ముందడుగేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్పందించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారన్నారు రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని వెల్లడించారు. . కొత్త జీఎస్టీ వల్ల రిజిస్ట్రేషన్ లో వేగం పెరుగుతుందని చెప్పారు.
READ MORE: Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వివరాలు ఇలా.!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేసిన వాహనాల జాబితా..
మోటార్ సైకిళ్లు: 2,352,
కార్లు/క్యాబ్లు :241,
ట్రాక్టర్లు 60, ఆటోలు: 227
గూడ్స్ వాహనాలు: 47,
ఆటో, గూడ్స్ వాహనాలు: 50
ఇతర వాహనాలు: 12
కాగా.. వంటగది సరకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు సోమవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఈనెల 22 నుంచి తగ్గించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ-యోగా కేంద్రాలపై; ఫేస్పౌడర్, షేవింగ్క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5 శాతానికి తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!