GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మే నెలలో 1.5 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది. మే నెలలో వసూలైన మొత్తం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో సీజీఎస్టీ రూ. 28,411 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 35,828 కోట్లు. ఐజీఎస్టీ రూ. 81,363 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,772 కోట్లతో కలిపి). అలాగే సెస్ రూ. 11,489 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా వచ్చిన రూ. 1,057 కోట్లతో కలిపి).
2023 నెలలో వచ్చిన ఆదాయాలు గతేడాది ఇదే నెలలోని జీఎస్టీ రాబడి కంటే 12 శాతం ఎక్కువ. ఈ నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 12 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 11 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.35,369 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.29,769 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత మే 2023లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.63,780 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.65,597 కోట్లుగా ఉంది.
Also Read
- SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Read Also:Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..
కాగా గత నెల అంటే 2023 ఏఫ్రిల్ లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.1,87,035 కోట్లకు చేరుకున్నాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.75 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కాడవం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో మాత్రమే వసూళ్లు కాస్త తగ్గాయి. ఆ తర్వతా నుంచి మళ్లీ పుంజుకుని ప్రతి నెల కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కాగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి క్యూ 4 లో 6.1 శాతంగా నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. గత అంచనాలను మించి భారత వృద్ధి వృద్ధి నమోదు చేయడం మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇదే తరహా ఫలితాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా జీడీపీ వృద్ధి అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు.
Read Also:Mahendra singh dhoni: కప్ గెలిచిన రెండ్రోజులకే ఆస్పత్రిలో చేరిన ధోనీ
తాజావార్తలు
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!