GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మే నెలలో 1.5 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Collection: ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఇందుకు సంబంధించిన గణంకాలు అధికారికంగా వెల్లడించింది. మే నెలలో వసూలైన మొత్తం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో సీజీఎస్టీ రూ. 28,411 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 35,828 కోట్లు. ఐజీఎస్టీ రూ. 81,363 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,772 కోట్లతో కలిపి). అలాగే సెస్ రూ. 11,489 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా వచ్చిన రూ. 1,057 కోట్లతో కలిపి).
2023 నెలలో వచ్చిన ఆదాయాలు గతేడాది ఇదే నెలలోని జీఎస్టీ రాబడి కంటే 12 శాతం ఎక్కువ. ఈ నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 12 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 11 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.35,369 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.29,769 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత మే 2023లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.63,780 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.65,597 కోట్లుగా ఉంది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..
కాగా గత నెల అంటే 2023 ఏఫ్రిల్ లో వచ్చిన జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.1,87,035 కోట్లకు చేరుకున్నాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.75 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కాడవం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో మాత్రమే వసూళ్లు కాస్త తగ్గాయి. ఆ తర్వతా నుంచి మళ్లీ పుంజుకుని ప్రతి నెల కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కాగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి క్యూ 4 లో 6.1 శాతంగా నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. గత అంచనాలను మించి భారత వృద్ధి వృద్ధి నమోదు చేయడం మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇదే తరహా ఫలితాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా జీడీపీ వృద్ధి అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు.
Read Also:Mahendra singh dhoni: కప్ గెలిచిన రెండ్రోజులకే ఆస్పత్రిలో చేరిన ధోనీ
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!