UP: పెళ్లికి ముందు కాబోయే అత్తగారితో కలిసి అల్లుడు జంప్!
- అత్త తన కాబోయే అల్లుడికి స్మార్ట్ఫోన్ బహుమతి
- అల్లుడు-అత్త మధ్య పెద్ద ఎత్తున సంభాషణలు
- నగదు, నగలు తీసుకుని పారిపోయిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..’ ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన మొత్తం గ్రామంలో సంచలనం సృష్టించింది.
అలీఘర్లోని మద్రక్ ప్రాంతంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి కుమార్తె వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. బంధువులను ఆహ్వానించారు. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. అంతలోనే కాబోయే అల్లుడు అత్తతో కలిసి జంప్ అయ్యాడు. తన భార్య బంధువుల వద్దకు వెళ్లి ఉండవచ్చని బాధితుడు అనుకున్నాడు. కానీ కూతురికి కాబోయే వరుడు కూడా కనిపించకుండా పోవడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తమ అమ్మాయితో ఓ అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి తల్లి తన కాబోయే అల్లుడికి స్మార్ట్ఫోన్ను బహుమతిగా ఇచ్చింది. తన కూతురిని వివాహం చేసుకోబోయే అబ్బాయి కాబోయే భార్యతో కాకుండా అత్తతో గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడు. వాస్తవానికి.. ఆ అబ్బాయికి కాబోయే మావయ్య వృత్తిరీత్యా పేరే ప్రాంతానికి వెళ్లాడు. మూడు నెలల తర్వాత తాను గ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పుడు తన భార్య కాబోయే అల్లుడితో ఎక్కువగా మాట్లాడుతుందని గ్రహించాడు. అయినా.. బాధితుడు ఎక్కువగా పట్టించుకోలేదు. పెళ్లి పనుల్లో బిజీగా మారాడు.
ఈ నేపథ్యంలో కాబోయే అల్లుడితో ఆ అత్త ప్రేమలో పడింది. అత్త ఇంట్లో ఉన్న రూ.3.5 లక్షల నగదు, దాదాపు రూ.5 లక్షల విలువైన ఆభరణాలను తీసుకుని అల్లుడితో కలిసి పారిపోయింది. ‘వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..’ అని ఓ లెటర్లో రాశారు. దీంతో బాధితుడు ఏం చేయాలో తెలియక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!