Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greater Noida: గ్రేటర్ నోయిడాలోని జలపుర గ్రామంలో ఓ వివాహిత మరణం అందరినీ తీవ్రంగా కలచివేసింది. దాదాపు 14 నెలల క్రితం కోటి రూపాయలకు పైగా ఖర్చుతో ఎంతో వైభవంగా జరిగిన పెళ్లి, ఇప్పుడు ఓ ఘోర విషాదాంతంగా మిగిలిపోయింది. అదనపు కట్నం కోసం నిరంతరం వేధించడంతో మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఇంటి పైకప్పు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమె పుట్టింట్లో కోలాహలం నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి భర్త, మామలను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడీ ఖేడా గ్రామానికి చెందిన దీపికకు, జలపుర నివాసి రితిక్తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. తమ హోదాకు మించి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి పెళ్లి జరిపించినప్పటికీ, అత్తవారింటి వేధింపులు ఆగలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, క్రమంగా దీపికపై అదనపు కట్నం కోసం మానసిక, శారీరక వేధింపులు పెరిగాయని, పలుమార్లు ఆమెపై భౌతిక దాడులు సైతం జరిగాయని పేర్కొన్నారు. సమాజం కోసం, బంధాలను కాపాడుకోవడం కోసం దీపిక వాటన్నింటినీ భరిస్తూ వచ్చిందని, కొన్నిసార్లు సర్దుబాటు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. చివరికి ఒక రాత్రి ఆమె బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయిందనే వార్త వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీపిక తండ్రి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై సెంట్రల్ నోయిడా డీసీపీ శైలేంద్ర కుమార్ సింగ్ స్పందిస్తూ.. శనివారం రాత్రి ఒక మహిళ పైకప్పు నుంచి పడి మరణించినట్లు సమాచారం అందడంతో వెంటనే పోలీసు బృందం అక్కడికి చేరుకుని చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన భర్త రితిక్, మామ మనోజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోని అన్ని కోణాలను విచారిస్తున్నామని, పొరుగువారిని అడిగి మరికొన్ని ఆధారాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన పెళ్లి వీడియోలు, ఫోటోలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోవడంతో దీపిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ బిడ్డను అత్తవారింటి ఒత్తిడే బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్నం వేధింపులపై సరైన సమయంలో స్పందించి ఉంటే ఒక ప్రాణం మిగిలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనకు ముందు ఇంట్లో ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొబైల్ కాల్ డేటా, డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దాని ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!