Chain Snatchers : చూపులన్నీ టార్గెట్ వైపే.. దొంగలను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు.. కొట్టేయాలని వన్స్ ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్ దగ్గర ఉన్న వస్తువు మీదు ఉంటుంది. ఈ క్రమంలో వస్తువు ఓనర్ ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ అచ్చం ఇట్లాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు.
Also Read : Man Chops Woman Body: మహిళను చంపి ముక్కలు ముక్కలుగా పాతేశాడు..
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.. దీంతో రూట్ మార్చారు. ఈ క్రమంలో మల్కపేట గ్రామానికి చెందిన వృద్దురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి స్నేహితుడుకి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు.
Also Read : Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
దీంతో ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా వృద్దురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని పోలీసులు నిర్థారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ బైక్, ఇద్దరి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా నిందితులిద్దరు నేరాన్ని అంగీకరిండంతో రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సీఐ కిరణ్ తెలిపారు. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో పరిష్కరించినందుకు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఇంటి దొంగను పట్టించి.. తన సొమ్మును రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు వృద్దురాలు కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!