GPS Bill: అసెంబ్లీ ముందుకు జీపీఎస్ బిల్లు.. బిల్లులో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GPS Bill: జీపీఎస్ బిల్లును చివరి రోజు శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముందస్తుగా అజెండాలో పెట్టకుండానే నేరుగా అసెంబ్లీ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది.. జీపీఎస్ ను సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే కాగా.. జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టి.. సభలో మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి.. బిల్లులోని కీలక అంశాలను పరిశీలించినట్లు అయితే.. రిటైర్ అయ్యే నాటికి ఉన్న బేసిక్ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇవ్వనున్నారు.. పెన్షన్ దారు మరణిస్తే భార్య లేదా భర్తకు పింఛన్లో 60 శాతం గ్యారెంటీ పొందుపర్చారు. ద్రవ్యోల్బణం ప్రకారం సర్దుబాటు చేసిన డీఏగా లాస్ట్ డ్రా బేసిక్ పేపై జీవన వ్యయ సర్దుబాటు చేస్తారు. ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉన్నా నెలకు 10 వేలు కనీస పింఛను భరోసా ఇవ్వబోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం వర్తింప జేస్తారు.
ఇక, జీపీఎస్ పథకం వర్తించాలంటే బిల్లు ప్రకారం ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు ఓసారి పరిశీలిస్తే.. వాలంటీర్ రిటైర్మెంట్ అయితే కనీసం 20 ఏళ్లు సర్వీస్ చేసి ఉండాలి.. సర్వీస్ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు.. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్ లాంటి సందర్భాల్లో పథకం వర్తించదు.. ఇక, జీపీఎస్తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం.. 108 డ్రైవర్లకు జీతాలు పెంచాం.. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం అన్నారు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
మరోవైపు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ.. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచామని గుర్తుచేశారు. 2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం.. విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం చేకూరిందని ఈ సందర్భంగా అసెంబ్లీలో వెల్లడించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?