Sub Registrar Offices: రాచరిక పోకడలకు స్వస్తి.. స్వయంగా పోడియం పగలగొట్టిన రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు సర్కారు స్వస్తి
- గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోడియంను పగలగొట్టిన రెవెన్యూ స్పెషల్ సీఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sub Registrar Offices: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు. చుట్టుగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డయాస్, స్టేజ్లను తొలగించే కార్యక్రమాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కూర్చొనే స్టేజి, చుట్టూ పోడియం లాగా కోర్టుల్లో వున్న విధానాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్ వందేభారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఒప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా వెల్లడించారు. తాను కూడా భయపడేవాడినని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే జనం పట్ల మర్యాద పూర్వకంగా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను మర్యాద పూర్వకంగా చూడాలన్నారు. కోర్టులాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వుండేవని.. సబ్ రిజిస్ట్రార్కు స్టేజి వుండేదని.. చుట్టూ పోడియం వుండేదని చెప్పారు. ఆ వాతావరణం చూస్తే కోర్టుకు వచ్చినట్లుగా ఉండేదన్నారు. ఈ పద్ధతి మార్చాలని సర్క్యూలర్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు కోర్టుకు వచ్చినట్లు వుండకూడదన్నారు.
బ్రిటీష్ కాలం నుండి ఉన్న అట్మాస్పియర్ మార్చాలని సీఎం చంద్రబాబు నిర్మాణం తీసుకున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మన ప్రభుత్వం.. మనకు సేవ చేసేందుకే అధికారులున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారితో ఫ్రెండ్లీ అట్మాస్పియర్ వుండాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డయాస్ను పగులగొట్టే కార్యక్రం చేశామన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!