Rs.50 For Tomato: స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. నేటి నుంచి రూ.50కే కిలో టమాటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది. దీంతో ఇప్పుడు దేశంలో అన్నీ చౌకగా ఉండబోతున్నాయని కూడా కాదు. అయితే గత నెల రోజులుగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న టమాటా ధర కిలోకు రూ.200 లేదా 150 నుంచి 50 రూపాయల వరకు తగ్గుతోంది. అవును.. ఆగస్టు 15, 2023 నుండి కిలోకు రూ. 50 రిటైల్ ధరకు టమాటాలను విక్రయించాలని ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం నాఫెడ్, ఎన్సిసిఎఫ్లను ఆదేశించింది. హోల్సేల్ మార్కెట్లో టమాట ధరలు పతనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం టమాటా విక్రయించి నెల రోజులు కావస్తోంది
దేశంలో టమాటా ధరలు బాగా పెరిగిన తర్వాత ప్రభుత్వం 14 జూలై 2023 నుండి టమాటాలను విక్రయించడం ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రభుత్వం జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకు మొత్తం 15 లక్షల కిలోల టమాటాలను విక్రయించింది. నాఫెడ్, ఎన్సిసిఎఫ్ వంటి ప్రభుత్వ సంస్థలు నిరంతరం టమాటాలను సేకరించి ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Read Also:Himachal rains: రాష్ట్రాన్ని ముంచేస్తున్న వరదలు..గత 24 గంటల్లో 50 మంది మృతి..
ఢిల్లీ కాకుండా ఈ రెండు ఏజెన్సీలు జైపూర్, కోట, లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్, పాట్నా, ముజఫర్పూర్, అర్రా, బక్సర్ వంటి నగరాల రిటైల్ మార్కెట్లలో టమాటాలను అందుబాటులో ఉంచాయి. తద్వారా దాని ధరలను తగ్గించవచ్చు. నాఫెడ్, ఎన్సిసిఎఫ్ (నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్) ప్రారంభంలో టమాటాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి కిలో రూ.90 చొప్పున విక్రయించడం ప్రారంభించాయి. అప్పట్లో మార్కెట్లో కిలో ధర 180 నుంచి 200 రూపాయల వరకు ఉండేది. తర్వాత జూలై 16న వాటి ధర రూ.80కి తగ్గించి, జూలై 20న కిలో రూ.70గా నిర్ణయించారు.
ఇప్పుడు మరోసారి టమాటా ధరను తగ్గించబోతున్నాయి ఈ ప్రభుత్వ సంస్థలు. ఆగస్టు 15 నుంచి సాధారణ ప్రజలకు కిలో రూ.50కే టమాటా అందుబాటులోకి రానుంది. దీంతో సామాన్యులు ఇక్కడ చౌకగా టమాటాలు కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీలో ప్రభుత్వం మొబైల్ వ్యాన్ల ద్వారా 70 ప్రాంతాల్లో తక్కువ ధరకు టమాటాలను విక్రయిస్తోంది. నోయిడాలో 15 చోట్ల టమాటా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ‘ONDC’లో టమోటాలను కూడా రిటైల్ చేస్తోంది.
Read Also:Off The Record: యార్లగడ్డ పార్టీ మారిపోతారా? రిక్వెస్ట్ చేశారా? వార్నింగ్ ఇచ్చారా?
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..