Governor Tamilisai : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించిన గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై నేడు దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె.. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని పోలీసు డైరెక్టర్ జనరల్ను కోరారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం ఖండనీయమని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె అన్నారు.
Also Read : Trade Advisory Committee: పదే పదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ఆర్థికశాఖ మంత్రి ఎదుట వ్యాపారుల ఆవేదన
అయితే.. ఇటీవల కవితను బీజేపీకి రమ్మన్నారంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ఎంపీ అర్వింద్ స్పందించారు. అయితే.. అర్వింద్ వ్యాఖ్యలు వివాదస్పందంగా ఉన్నాయంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన తరువాతే ఎమ్మెల్సీ మీడియా ముందు ఎంపీ అర్వింద్పై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ఎంపీ అర్వింద్పై విమర్శలు గుప్పించారు. అయితే.. మరో వైపు ఈ దాడిని బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలపునిచ్చారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?