Adluri Laxman: కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచింది
- బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు
- కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచింది- లక్ష్మణ్
- కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు- లక్ష్మణ్
- గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్.. మంత్రులు సెక్రటేరియట్ కే రాలేదు- లక్ష్మణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ అంటున్నారు.. ఆరు నెలల కింద కూడా మూడోసారి తమదే రాజ్యం అన్నారు.. చివరకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు క్లియర్ తీర్పు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, మంత్రులు సెక్రటేరియట్ కే రాలేదని ఆరోపించారు.
Read Also: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
Also Read
- Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
కాంగ్రెస్ మంత్రులు, సీఎం సెక్రటేరియట్ కు వస్తున్నారు.. ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. అధికారంలోకి వస్తాం అని అంటున్న కేసీఆర్… ఎంపీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా అని ఎద్దేవా చేశారు. పోలింగ్ లో చేతులు ఎత్తేసే.. బీజేపీకి మద్దతు ఇచ్చింది మీరని మండిపడ్డారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకా.. నాలుగు గ్యారెంటీలు అమలు చేశారని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నామన్నారు.
Read Also: Breaking News: రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా..
కేసీఆర్, కేబినెట్ మంత్రులనే కలవలేదని.. సీఎం రేవంత్ రెడ్డిని తాము రోజు కలుస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. ఉద్యమ పార్టీ అంటున్నావు.. ఆరు నెలల కూడా పార్టీని నిలబెట్టుకోలేక పోతున్నావని విమర్శించారు. ఓడిపోయిన తరువాత కూడా జనంలోకి రావడం లేదన్నారు. మళ్ళీ ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
-
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
-
Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
-
New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?