Raja Singh: బీజేపీలో చేరుతున్నారా?.. కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి పెట్టుకోండి!
- బీజేపీలో చేరుతున్న వారికి రాజా సింగ్ హెచ్చరికలు
- పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి
- బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి
- బాధలు భరించే శక్తి మీలో పెంచుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goshamahal MLA Raja Singh warns newcomers to BJP: బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేని కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
‘బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలామంది చేరుతున్నారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం. బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, రాసి కూడా పెట్టుకోండి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుంటారు కదా. మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
Also Read: World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
‘మా అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. మా జిల్లా, డివిజన్, నియోజకవర్గంలో వాళ్ల వ్యక్తి ఉంటాడు. మేము కోరుకున్నా మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయాము. గోషామహల్ అసెంబ్లీ నుంచి బీజేపీలో చేరేముందు కొంతమందితో మీరు మాట్లాడి.. చేరిన తర్వాత ఏమైతదని కనుక్కోండి. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి.. చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్లిపోయారో కనుక్కోండి. నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే?.. అలాంటి వారితో ఒక్కసారి మాట్లాడండి. హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ కొందరి వల్ల సర్వనాశనం అవుతోంది. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అయితది, మేము ఏది రాసితే అదే రాజ్యమైతది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!