NTV Telugu Site icon

Goodachari 2: ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..

G2

G2

Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Fight For Mutton Curry: పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..

రెండవ పార్ట్ బడ్జెట్ విషయానికి వస్తే రూ.100 కోట్లతో ‘గూడాచారి 2’ భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ప్రస్తుతం ‘గూడాచారి 2’ షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా చేయడానికి మేకర్స్ స్విట్జర్లాండ్ , పోలాండ్, ఇటలీ ఇలా మరికొన్ని యూరోపియన్ దేశాలలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

America : అమెరికాలో అంతుచిక్కని వ్యాధి.. హడలిపోతున్న జనాలు

‘గూడాచారి 2’ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ సినిమా నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతానికి దీని విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. దాని ప్రీక్వెల్ ‘గూడాచారి’ తెలుగులో మాత్రమే విడుదలైంది. ఆ తరువాత మేకర్స్ దానిని హిందీలో ‘ఇంటిలిజెంట్ ఖిలాడీ’గా డబ్ చేసారు.