Akshaya Tritiya 2025: బంగారం ధరలు పెరిగినా తగ్గేదేలే.. అక్షయ తృతీయ నాడు వేల కోట్ల వ్యాపారం!
- అక్షయ తృతీయ నాడు వేల కోట్ల వ్యాపారం
- రూ. 16 వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, అక్షయ తృతీయ సందర్భంగా నేడు దేశీయ ఆభరణాల విపణిలో దాదాపు రూ. 16 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది.
Also Read:Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
Also Read
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
ఓ వైపు పుత్తడి ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ రోజు తక్కువ పరిమాణంలోనైనా బంగారం కొనేందుకు ప్రజలు ముందుకు వస్తారని తెలిపింది. గతేడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 73,500గా ఉంది. ప్రస్తుతం రూ. లక్షకు చేరింది. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఈ ఏడాది కొనుగోళ్లపై ప్రభావం పడొచ్చని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. అక్షయ తృతీయ రోజున దాదాపు 12 వేల కోట్ల విలువైన 12 టన్నుల పసిడి, రూ. 4 వేల కోట్ల విలువైన 40 టన్నుల వెండి అమ్మకాలు నమోదు కావొచ్చని ఆయన అంచాన వేశారు. మొత్తంగా రూ. 16 వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేశారు.
తాజావార్తలు
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!