Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Sales Decline: దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో కళకళలాడాల్సిన బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి బంగారం కొనవద్దని చేసిన పిలుపు తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని తెలిపారు.
గత రెండు నుంచి మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రభావం కూడా కేంద్రంపై ఎక్కువగా పడిందని సత్యనారాయణ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారిందని, అందుకే బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారం ధరలు భారీగా పెరగడం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?