Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price: దేశంలో బంగారం ధరలు నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,170కి తగ్గింది. విశేషమేమిటంటే ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది. మే 24న బంగారం ధరలు గరిష్టంగా రూ.62,720కి చేరాయి. ఇప్పుడు దీని తర్వాత అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? లేదా పెట్టుబడిదారులు బంగారం ధర మరింత తగ్గేంతవరకు కోసం వేచి ఉండాలా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం?
ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొఠారి మాట్లాడుతూ.. స్వల్పకాలంలో బంగారం తన సురక్షితమైన ఆకర్షణను కోల్పోయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య వైఖరి గురించి చాలా కఠినంగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, US ఫెడ్ గత 15 నెలల్లో వడ్డీ రేట్లను 500 bps, BoE 475 bps, ECB 400 bps పెంచింది.
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
Read Also:Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి 3-4 శాతం తగ్గవచ్చని, స్వల్పకాలంలో మరింత బలహీనంగా ఉండవచ్చని కొఠారీ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని, ప్రస్తుత స్థాయిల కంటే 3-4 శాతం మేర తగ్గుతాయని కొఠారీ చెబుతున్నారు. విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ప్రపంచ ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల చర్యలను పరిశీలిస్తే కేవలం ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే బంగారం ధర పతనం కనిపిస్తోంది.
బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?
బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని కొఠారి తెలిపారు. 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నారు. దీంతో బంగారం ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్ల, పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది. దీని కారణంగా ధరలు పెరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంవత్సరం చివరి నాటికి, ప్రపంచం మాంద్యంలో చిక్కకుంటుదని చెబుతున్నారు. అప్పుడు బంగారం ధర పది గ్రాములకు 65 వేలకు చేరుకుంటుందట.
Read Also:Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి
తాజావార్తలు
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..