Godavari River: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం.. 42 అడుగుల వద్దకు తగ్గిన నీటిమట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వరద నీరు భారీగా గోదావరిలో చేరుతుంది. దీంతో పైనుండి వచ్చే వరదలతో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గత మూడు రోజుల నుంచి గోదావరి హెచ్చుతగ్గులు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద స్థాయి దిగువకి ప్రవహిస్తుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోవడంతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. శుక్రవారం గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దాని పర్యవసానం పై నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే రెండు రోజులు ఉండి వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు పరిశీలించారు. నిన్న ఉదయం నుంచి గోదావరి తగ్గు ముఖం పట్టినప్పటికీ మళ్లీ రాత్రి ఒక అడుగు మేరకు పెరిగింది. మళ్లీ మొదటి ప్రమాద స్థాయికి గోదావరి పెరిగింది.
Gujarat: గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్ ప్రమాణ స్వీకారం
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ఆదివారం తెల్లవారు జాము నుంచి మళ్ళీ గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 42 అడుగులతో గోదావరి నీటిమట్టం ఉంది. అంటే మొదటి ప్రమాదవ స్థాయి దిగువలో గోదావరి వరద భద్రాచలం వద్ద ఉన్నది. దిగువన ఉన్న పోలవరం వద్ద గోదావరి నీరు వేగంగా వెళ్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద తగ్గు ముఖం పట్టింది. అయితే శబరి నది కూడా పోటు ఉండటంతో గోదావరి చాలా స్వల్పంగా తగ్గుతూ ఉన్నది. మరోవైపు వరద నీటి వల్ల ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం తెలిపిన సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.
తాజావార్తలు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!