Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..
రేపు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని సీమాంధ్రలు, పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆమోదించిన విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. ఏపీకి అన్యాయం చేస్తూనే ఉన్నారు అంటూ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు ఒకటే.. అధికారికంగా పొత్తు లేకపోయినా రెండు పార్టీలు 10 ఏళ్లుగా కలిసే పని చేస్తున్నాయి.. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలంతా ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని కోరారు.
Read Also: Chennai-Pune Train: చెన్నై-పూణే ట్రైన్లో కలుషిత ఆహారం.. 40 మంది ప్రయాణికులకు అస్వస్థత..
Also Read
అలాగే, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ ప్రజలంతా తెలంగాణ కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి.. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో మార్పు రావాలి.. ఈ ఎన్నికతో దేశంలో మార్పు రావాలి.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీకి న్యాయం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పోలవరంకు జాతీయ హోదా దక్కుతుంది.. తెలంగాణ, ఏపీ అన్నదమ్ములుగా బాగు పడుదాము.. రాజకీయంగా ఏపీలో కాంగ్రెస్ బలపడడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది.. అప్పుడే విభజన హామీలన్నీ నెరవేరుతాయని రఘువీరారెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!