Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని సీమాంధ్రలు, పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆమోదించిన విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. ఏపీకి అన్యాయం చేస్తూనే ఉన్నారు అంటూ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు ఒకటే.. అధికారికంగా పొత్తు లేకపోయినా రెండు పార్టీలు 10 ఏళ్లుగా కలిసే పని చేస్తున్నాయి.. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలంతా ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని కోరారు.
Read Also: Chennai-Pune Train: చెన్నై-పూణే ట్రైన్లో కలుషిత ఆహారం.. 40 మంది ప్రయాణికులకు అస్వస్థత..
Also Read
అలాగే, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ ప్రజలంతా తెలంగాణ కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి.. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో మార్పు రావాలి.. ఈ ఎన్నికతో దేశంలో మార్పు రావాలి.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీకి న్యాయం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పోలవరంకు జాతీయ హోదా దక్కుతుంది.. తెలంగాణ, ఏపీ అన్నదమ్ములుగా బాగు పడుదాము.. రాజకీయంగా ఏపీలో కాంగ్రెస్ బలపడడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది.. అప్పుడే విభజన హామీలన్నీ నెరవేరుతాయని రఘువీరారెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!