GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు.. ఎన్నికలు జరుగుతాయా?
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు.
- ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలు.
- ఎన్నికలకు దూరంగా బీజేపీ పార్టీ .
- ఎన్నికల నిర్వహణకు కనీసం 15 మంది సభ్యులు నామినేషన్స్ అవసరం.
- ఏకగ్రీవంగా ఎన్నుకోబడే అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ రోజు (సోమవారం) చివరి రోజుగా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత ఆరు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో రెండు నామినేషన్లు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన కార్పొరేటర్లు దాఖలు చేయగా, మిగిలిన రెండు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
Also Read
- RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
- Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
నేడు నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఐఎం (మజ్లిస్) పార్టీకి చెందిన కార్పొరేటర్లు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ నుండి మరికొందరు కార్పొరేటర్లు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ మెజారిటీ సంఖ్యా బలం లేదని భావించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుండి ఎలాంటి నామినేషన్లు వచ్చే అవకాశమే లేదు.
GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు కనీసం 15 మంది సభ్యులు నామినేషన్స్ దాఖలు చేయాలి. కానీ, ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్లే వచ్చాయి. నేడు మరిన్ని నామినేషన్లు దాఖలైతేనే ఎన్నిక జరగనుంది. లేదంటే, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడే అవకాశముంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!