Gautam Gambhir: శ్రేయస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు!
- శ్రేయస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు
- యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలనుకున్నాం
- జైస్వాల్ కంటే శ్రేయస్ మఖ్యమైన ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్.. 36 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో 59 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్తో రెండు, మూడు వన్డేల్లో వరుసగా 44, 78 పరుగులు చేసి భారత్ సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడటంతో తనకు ఆడే అవకాశం లభించిందని తొలి వన్డే అనంతరం శ్రేయస్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ‘ఇంగ్లండ్తో సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా శ్రేయాస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణించిన యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలనుకున్నాం. కేవలం ఒక్క ఇన్నింగ్స్తో జైస్వాల్పై ఓ అభిప్రాయానికి రాలేము. జైస్వాల్ కంటే శ్రేయస్ మఖ్యమైన ఆటగాడు. శ్రేయస్ను తప్పించాలని మేం అనుకోలేదు’ అని గౌతీ తెలిపాడు.
Also Read
- India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమ్ ఇండియాకు ‘కరన్’ గండం!
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ప్రిలిమినరీ జాబితాలో యశస్వి జైస్వాల్ పేరు ఉంది. కానీ తుది జాబితాలో అతడికి చోటు దక్కలేదు. నాన్ ట్రావెలింగ్ జాబితాలో ఉన్నాడు. అవసరం అయితే జైస్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ వెళ్తాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 17న విదర్భతో ఆరంభమయ్యే రంజీ సెమీఫైనల్లో ఆడే ముంబై జట్టులో సెలక్టర్లు యశస్వి పేరును చేర్చారు.
తాజావార్తలు
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమ్ ఇండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!