Gautam Gambhir: శ్రేయస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు!
- శ్రేయస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు
- యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలనుకున్నాం
- జైస్వాల్ కంటే శ్రేయస్ మఖ్యమైన ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు అని, అతడిని తప్పించాలని ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలని భావించామని చెప్పాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ 59 పరుగులు చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆటతో అలరించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్స్ కోల్పోయిన దశలో వచ్చిన శ్రేయస్.. 36 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సులతో 59 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్తో రెండు, మూడు వన్డేల్లో వరుసగా 44, 78 పరుగులు చేసి భారత్ సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడటంతో తనకు ఆడే అవకాశం లభించిందని తొలి వన్డే అనంతరం శ్రేయస్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ‘ఇంగ్లండ్తో సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా శ్రేయాస్ అయ్యర్ను తప్పించాలనుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణించిన యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలనుకున్నాం. కేవలం ఒక్క ఇన్నింగ్స్తో జైస్వాల్పై ఓ అభిప్రాయానికి రాలేము. జైస్వాల్ కంటే శ్రేయస్ మఖ్యమైన ఆటగాడు. శ్రేయస్ను తప్పించాలని మేం అనుకోలేదు’ అని గౌతీ తెలిపాడు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ప్రిలిమినరీ జాబితాలో యశస్వి జైస్వాల్ పేరు ఉంది. కానీ తుది జాబితాలో అతడికి చోటు దక్కలేదు. నాన్ ట్రావెలింగ్ జాబితాలో ఉన్నాడు. అవసరం అయితే జైస్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ వెళ్తాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 17న విదర్భతో ఆరంభమయ్యే రంజీ సెమీఫైనల్లో ఆడే ముంబై జట్టులో సెలక్టర్లు యశస్వి పేరును చేర్చారు.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!