Galwan Valley Clash: గాల్వన్ హింసకు మూడేళ్లు.. ప్రస్తుతం LAC పరిస్థితి ఎలా ఉంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Galwan Valley Clash: అది 15 జూన్ 2020.. తూర్పు లడఖ్లోని గాల్వాన్లో భారతదేశం, చైనాల మధ్య హింసాత్మక ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ మూడేళ్ల కాలంలో చైనా వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. దీని కారణంగా LAC పై ఉద్రిక్తత ఉంది. గల్వాన్ ఘర్షణ మూడో వార్షికోత్సవం సందర్భంగా గురువారం భారత ఆర్మీ అధికారులు లేహ్లో సమావేశం నిర్వహించారు.
చైనాను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంతంలో భారత్ మరింత బలపడుతోంది. ఈ సమావేశంలో సైన్యం సన్నద్ధతపై కూడా చర్చించారు. దీనికి నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హింసాకాండ జరిగిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు దేశాల మధ్య పరిస్థితి ఎలా ఉంది? భారత్తో చైనా వైఖరి ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
Also Read
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
Read Also:Mahalakshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనంత సంపదలు మీ సొంతమవుతాయి
మూడేళ్ల తర్వాత సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది
2020 నుండి భారతదేశం-చైనా సంబంధాలలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గాల్వాన్లో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 38 మందికి పైగా సైనికులు మరణించారు. దీని తరువాత LAC పై ఆర్మీ ఫోర్స్ పెంచబడింది. దాదాపు ఏడాది పాటు వాతావరణం చాలా దారుణంగా ఉంది. గత మూడు సంవత్సరాలలో భారతదేశం ప్రాథమికంగా 3500 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి)పై తనను తాను బలోపేతం చేసుకుంది.
చల్లారని ఉద్రిక్తత
2020 సంవత్సరంలో హింసాత్మక ఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కూడా LAC విషయంలో భారతదేశం, చైనా మధ్య ఇప్పటికీ ఉద్రిక్తత ఉంది. చాలాసార్లు సైన్యాలు ముఖాముఖికి వచ్చాయి కానీ ఆ రకమైన ఘటన పునరావృతం లేదు. ఆ వాగ్వివాదం తరువాత భారతదేశం అనేక స్థాయిలలో చైనా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. ఆ సమయంలో హింసాకాండ జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశమై ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 2021లో అనేక రౌండ్ల చర్చల తర్వాత రెండు దేశాలు పాంగోంగ్ లేక్, గోగ్రా నుండి తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నాయి.
Read Also:Kolkata Airport : ప్రమాదమా లేక కుట్ర? ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు
భారత్ బలాన్ని పెంచుతోంది
చైనా చేష్టల దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ ఎల్ఏసీలో తన బలాన్ని పెంచుకుంటోంది. దీని కోసం భారతదేశం గత మూడు సంవత్సరాలుగా LAC పై హెలిప్యాడ్లు, వంతెనలు, గృహ నిర్మాణం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను సిద్ధం చేస్తోంది.
చైనాతో సంబంధాలు మామూలుగా లేవు
గాల్వన్ హింసాకాండ తర్వాత, చైనాతో భారత్ తన సంబంధాలను చాలా స్పష్టంగా చెప్పింది. సరిహద్దులో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, ఇది జరిగే వరకు చైనాతో సంబంధాలు మామూలుగా ఉండలేవని భారత్ చాలా సందర్భాలలో చెప్పింది. తాజాగా జూన్ 8న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.
జర్నలిస్టు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాల్సిందిగా చైనా ఆదేశించింది. వాస్తవానికి ఇక్కడ పనిచేస్తున్న భారతీయ జర్నలిస్ట్ తన వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ చైనా దానిని ఆమోదించలేదు. కఠినత్వం చూపుతూ చైనా జర్నలిస్టుల వీసాను పునరుద్ధరించడానికి భారతదేశం కూడా నిరాకరించింది. ఇప్పుడు ఇరు దేశాల్లో ఒకరి జర్నలిస్టుల ఉనికి పూర్తిగా ముగిసింది.
Read Also:Health Tips: రోజుకు ఒక్కటి తింటే చాలు..ఆ సమస్యలు దూరం…
మూడేళ్ల క్రితం ఏం జరిగింది?
వాస్తవానికి 2020 సంవత్సరంలో జూన్ 15 కంటే ముందు మే 1 న పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. దీంతో ఇరువర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది. జూన్ 15న గాల్వన్ లోయలో ఈ ఉద్రిక్తత హింసాత్మక రూపం దాల్చింది. భారతదేశం, చైనా సైనికులు పరస్పరం ఘర్షణ పడ్డారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారని, వారిని ఇక్కడి నుంచి సైనికులు అడ్డుకోవడంతో వారు హింసాత్మకంగా మారారు.
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?