Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Galwan Valley Clash Three Years Of Galwan Violence Condition On Lac China India Relations

Galwan Valley Clash: గాల్వన్ హింసకు మూడేళ్లు.. ప్రస్తుతం LAC పరిస్థితి ఎలా ఉంది?

Published Date :June 16, 2023 , 7:13 am
By Rakesh Reddy
Galwan Valley Clash: గాల్వన్ హింసకు మూడేళ్లు.. ప్రస్తుతం LAC పరిస్థితి ఎలా ఉంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Galwan Valley Clash: అది 15 జూన్ 2020.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లో భారతదేశం, చైనాల మధ్య హింసాత్మక ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ మూడేళ్ల కాలంలో చైనా వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. దీని కారణంగా LAC పై ఉద్రిక్తత ఉంది. గల్వాన్ ఘర్షణ మూడో వార్షికోత్సవం సందర్భంగా గురువారం భారత ఆర్మీ అధికారులు లేహ్‌లో సమావేశం నిర్వహించారు.

చైనాను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంతంలో భారత్ మరింత బలపడుతోంది. ఈ సమావేశంలో సైన్యం సన్నద్ధతపై కూడా చర్చించారు. దీనికి నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హింసాకాండ జరిగిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు దేశాల మధ్య పరిస్థితి ఎలా ఉంది? భారత్‌తో చైనా వైఖరి ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Read Also:Mahalakshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనంత సంపదలు మీ సొంతమవుతాయి

మూడేళ్ల తర్వాత సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది
2020 నుండి భారతదేశం-చైనా సంబంధాలలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గాల్వాన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 38 మందికి పైగా సైనికులు మరణించారు. దీని తరువాత LAC పై ఆర్మీ ఫోర్స్ పెంచబడింది. దాదాపు ఏడాది పాటు వాతావరణం చాలా దారుణంగా ఉంది. గత మూడు సంవత్సరాలలో భారతదేశం ప్రాథమికంగా 3500 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై తనను తాను బలోపేతం చేసుకుంది.

చల్లారని ఉద్రిక్తత
2020 సంవత్సరంలో హింసాత్మక ఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కూడా LAC విషయంలో భారతదేశం, చైనా మధ్య ఇప్పటికీ ఉద్రిక్తత ఉంది. చాలాసార్లు సైన్యాలు ముఖాముఖికి వచ్చాయి కానీ ఆ రకమైన ఘటన పునరావృతం లేదు. ఆ వాగ్వివాదం తరువాత భారతదేశం అనేక స్థాయిలలో చైనా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించింది. ఆ సమయంలో హింసాకాండ జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశమై ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 2021లో అనేక రౌండ్ల చర్చల తర్వాత రెండు దేశాలు పాంగోంగ్ లేక్, గోగ్రా నుండి తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నాయి.

Read Also:Kolkata Airport : ప్రమాదమా లేక కుట్ర? ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు

భారత్ బలాన్ని పెంచుతోంది
చైనా చేష్టల దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ ఎల్‌ఏసీలో తన బలాన్ని పెంచుకుంటోంది. దీని కోసం భారతదేశం గత మూడు సంవత్సరాలుగా LAC పై హెలిప్యాడ్‌లు, వంతెనలు, గృహ నిర్మాణం, ఇతర ప్రాథమిక సౌకర్యాలను సిద్ధం చేస్తోంది.

చైనాతో సంబంధాలు మామూలుగా లేవు
గాల్వన్ హింసాకాండ తర్వాత, చైనాతో భారత్ తన సంబంధాలను చాలా స్పష్టంగా చెప్పింది. సరిహద్దులో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, ఇది జరిగే వరకు చైనాతో సంబంధాలు మామూలుగా ఉండలేవని భారత్ చాలా సందర్భాలలో చెప్పింది. తాజాగా జూన్ 8న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.

జర్నలిస్టు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో భారతీయ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లాల్సిందిగా చైనా ఆదేశించింది. వాస్తవానికి ఇక్కడ పనిచేస్తున్న భారతీయ జర్నలిస్ట్ తన వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ చైనా దానిని ఆమోదించలేదు. కఠినత్వం చూపుతూ చైనా జర్నలిస్టుల వీసాను పునరుద్ధరించడానికి భారతదేశం కూడా నిరాకరించింది. ఇప్పుడు ఇరు దేశాల్లో ఒకరి జర్నలిస్టుల ఉనికి పూర్తిగా ముగిసింది.

Read Also:Health Tips: రోజుకు ఒక్కటి తింటే చాలు..ఆ సమస్యలు దూరం…

మూడేళ్ల క్రితం ఏం జరిగింది?
వాస్తవానికి 2020 సంవత్సరంలో జూన్ 15 కంటే ముందు మే 1 న పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. దీంతో ఇరువర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది. జూన్ 15న గాల్వన్ లోయలో ఈ ఉద్రిక్తత హింసాత్మక రూపం దాల్చింది. భారతదేశం, చైనా సైనికులు పరస్పరం ఘర్షణ పడ్డారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారని, వారిని ఇక్కడి నుంచి సైనికులు అడ్డుకోవడంతో వారు హింసాత్మకంగా మారారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • china india relations
  • Galwan Valley clash
  • galwan violence
  • LAC

తాజావార్తలు

  • Hardik Pandya: హనుమాన్ చాలీసాపై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Swiggy: స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. కస్టమర్లకు మరింత భారం

  • Mohanlal New Movies: లాలట్టన్ లైనప్‌ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!

  • IPL 2026 New Rules: మ్యాచ్ డే ప్రాక్టీస్ బ్యాన్.. ఐపీఎల్ 2026కి బీసీసీఐ కొత్త నిబంధనలు

  • Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions