IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కీలక సూచన!
- డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు
- టీమిండియాకు మాజీ ఓపెనర్ కీలక సూచన
- అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న గబ్బాలో రికార్డు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్.. అడిలైడ్ టెస్టులో ఓడిపోయింది. ఇక బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్లలో మూడుసార్లు 200 పరుగులలోపే భారత్ ఆలౌటైంది.
ఇటీవలి రోజుల్లో భారత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. టీమిండియా వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని, కనీసం 350 పరుగులు చేయాలని సూచించాడు. ‘టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక రోజైనా బ్యాటింగ్ చేయాలి. ఒక రోజులోపే ఆలౌట్ అవ్వడం ఏమాత్రం సరికాదు. స్కోర్ బోర్డుపై కనీసం 350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా.. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్కు దిగినప్పుడు 4, 5 స్టంప్ లైన్పై ఎక్కువగా బంతులు వేయాలి. బౌన్స్ను బాగా ఉపయోగించుకోవాలి. బ్రిస్బేన్లో పేసర్లకు ఇదే ప్రధాన అస్త్రం. మూడో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే గత పర్యటనలో ఇక్కడ ఆస్ట్రేలియాని టీమిండియా ఓడించింది’ అని హేడెన్ చెప్పాడు.
Also Read
- EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
- Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
- Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
- Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
బ్రిస్బేన్లోని గబ్బాలో భారత్ ఏడు టెస్టులు ఆడగా.. ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీమిండియా గెలిచింది. 2003లో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా కాగా.. మిగతా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. గబ్బాలో రికార్డు ఏమాత్రం బాగా లేకపోవడం, ఇటీవలి భారత్ ఫామ్. అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!