IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కీలక సూచన!
- డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు
- టీమిండియాకు మాజీ ఓపెనర్ కీలక సూచన
- అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న గబ్బాలో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్.. అడిలైడ్ టెస్టులో ఓడిపోయింది. ఇక బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్లలో మూడుసార్లు 200 పరుగులలోపే భారత్ ఆలౌటైంది.
ఇటీవలి రోజుల్లో భారత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. టీమిండియా వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని, కనీసం 350 పరుగులు చేయాలని సూచించాడు. ‘టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక రోజైనా బ్యాటింగ్ చేయాలి. ఒక రోజులోపే ఆలౌట్ అవ్వడం ఏమాత్రం సరికాదు. స్కోర్ బోర్డుపై కనీసం 350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా.. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్కు దిగినప్పుడు 4, 5 స్టంప్ లైన్పై ఎక్కువగా బంతులు వేయాలి. బౌన్స్ను బాగా ఉపయోగించుకోవాలి. బ్రిస్బేన్లో పేసర్లకు ఇదే ప్రధాన అస్త్రం. మూడో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే గత పర్యటనలో ఇక్కడ ఆస్ట్రేలియాని టీమిండియా ఓడించింది’ అని హేడెన్ చెప్పాడు.
Also Read
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
బ్రిస్బేన్లోని గబ్బాలో భారత్ ఏడు టెస్టులు ఆడగా.. ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీమిండియా గెలిచింది. 2003లో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా కాగా.. మిగతా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. గబ్బాలో రికార్డు ఏమాత్రం బాగా లేకపోవడం, ఇటీవలి భారత్ ఫామ్. అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..