G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ 7 దేశాలు భారత నిర్ణయాన్ని ఖండించాయి. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఎగుమతులపై పరిమితులు విధించడం… మార్కెట్లను మూసివేయడం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీ20లో సభ్యుడిగా ఉన్న భారత్ తన బాధ్యతలను నిర్వహించాలని కోరుతున్నామని ఓజ్డెమిర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆహార సరఫరా అంతరాయానికి రష్యా కారణం అంటూ జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఆహార కొరతకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గోధుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇండియా తరువాత రష్యా, ఉక్రెయిన్ లోనే గోధుమలు ఎక్కువగా పండుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో గ్లోబల్ సప్లై చైన్ కు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్లే ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను ఏకంగా 300 శాతం పెంచాయి.
తాజావార్తలు
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!