G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ 7 దేశాలు భారత నిర్ణయాన్ని ఖండించాయి. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఎగుమతులపై పరిమితులు విధించడం… మార్కెట్లను మూసివేయడం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీ20లో సభ్యుడిగా ఉన్న భారత్ తన బాధ్యతలను నిర్వహించాలని కోరుతున్నామని ఓజ్డెమిర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆహార సరఫరా అంతరాయానికి రష్యా కారణం అంటూ జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఆహార కొరతకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
- Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గోధుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇండియా తరువాత రష్యా, ఉక్రెయిన్ లోనే గోధుమలు ఎక్కువగా పండుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో గ్లోబల్ సప్లై చైన్ కు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్లే ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను ఏకంగా 300 శాతం పెంచాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!