G20 Summit: బ్యాగుతో జీ20కి చైనా ప్రతినిధి బృందం.. అందులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ20 సమ్మిట్ ముగిసింది.. కానీ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జీ20 సమ్మిట్ సందర్భంగా చైనా ప్రతినిధుల మర్మమైన బ్యాగ్.. హోటల్ తాజ్ ప్లేస్లో కలకలం రేపింది. ఈ సందర్భంగా 12 గంటల పాటు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. జీ20 సదస్సు కోసం భారతదేశానికి వచ్చిన చైనా ప్రతినిధి బృందానికి తాజ్ ప్యాలెస్ హోటల్లో ఆతిథ్యం ఇచ్చారు. బ్రెజిల్ ప్రతినిధి బృందం కూడా అక్కడ ఉంది. చైనీస్ ప్రతినిధి బృందంలోని సభ్యుని వద్ద ఒక విచిత్రమైన మర్మమైన బ్యాగ్ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆ బ్యాగ్ని హోటల్ సెక్యూరిటీ తనిఖీ చేయలేదు. బ్యాగ్లో వింతగా కనిపించే పరికరం గురించి హోటల్ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు, ఇతర భద్రతా బలగాలకు సమాచారం అందించారు. చైనా ప్రతినిధుల బ్యాగులను స్కానర్లో పెట్టాలని భద్రతా బలగాలు అభ్యర్థించాయి.
Also Read
బ్యాగ్ని తనిఖీ చేసేందుకు చైనా ప్రతినిధి బృందం నిరాకరించింది. దాదాపు 10 నుంచి 12 గంటల పాటు బ్యాగ్పై గొడవ జరిగింది. 12 గంటల పాటు అదే గది బయట భద్రతా బలగాలు మోహరించారు. జీ20 శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగిసింది. కొన్ని రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. చాలా ప్రయత్నాల తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. సెప్టెంబరు 9-10 తేదీలలో జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రాలేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా భారత్ పలు దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో చైనా టెన్షన్ బాగా పెరిగింది. జీ-20 సదస్సులో భారత్ బలాన్ని చూసి చైనా చలించిపోయింది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. జిన్పింగ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.
Read Also:Devara: రిలీజ్ డేట్ ని బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్…
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!