G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Food Festival: న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం ప్రారంభించారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ థీమ్ను ‘టేస్ట్ ది వరల్డ్’ అంటూ ప్రకటించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ నాలుగు జీ20 దేశాలు చైనా, టర్కీ, జపాన్, మెక్సికోలు పాల్గొంటున్నాయి. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇది ఎన్డీఎంసీ జీ20 ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే కాదు, దేశానికి ఫుడ్ ఫెస్టివల్ కూడా అని అన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోజువారీ ఆహార పదార్థాలలో మిల్లెట్లను చేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. మిల్లెట్లతో తయారు చేసిన రెడీ-టు-ఈట్ వంటకాలు, స్నాక్స్ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆహార ప్రియులు ఈ ఫెస్టివల్ ఏకం అవుతారని కేంద్రమంత్రి మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భారత్లోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వంటకాలను రుచి చూడవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన వంటకాలు ఈ ఫుడ్ ఫెస్టివల్లో లభిస్తాయని చెప్పారు.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
Ravindra Jadeja: జడేజాకు షాకిచ్చిన ఐసీసీ.. ఆ పని చేసినందుకు!
తాజ్ ప్యాలెస్, తాజ్ మహల్, ది కన్నాట్, తాజ్ అంబాసిడర్స్, లే మెరిడియన్, ఐటీసీ మౌర్య, ది పార్క్ సహా 11కి పైగా ప్రముఖ హోటళ్లు ఈ కార్యక్రమంలో తమ సంతకంతో కూడిన ఆహార పదార్థాలను అందజేయనున్నాయి. ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’ థీమ్పై వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫుడ్ ఫెస్టివల్లో ఎనిమిది స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది. తీహార్ బేకింగ్ స్కూల్తో పాటు ఢిల్లీ జైలు విభాగం కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటోంది. ఎన్ఎండీసీ పాల్గొనే వారందరికీ స్టాల్ కోసం స్థలం, మద్దతును అందిస్తోంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ జీ20 సమ్మిట్కు భారత్ అధ్యక్షత వహించడం, అంతర్జాతీయ వంటకాల గురించి అవగాహన కలిగిస్తుందని ఎన్ఎండీసీ పేర్కొంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!