Free Sanitary Pads: పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్?.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Sanitary Pads: 6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని, జాతీయ నమూనాను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని కోరింది. ఏప్రిల్ 10న, ఈ సమస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలతో సహా పాఠశాలల్లో రుతుస్రావ పరిశుభ్రత నిర్వహణపై ఏకరీతి జాతీయ విధానాన్ని అమలు చేయడానికి కేంద్రం అన్ని వాటాదారులతో నిమగ్నమవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకోవడానికి, జాతీయ విధానాన్ని రూపొందించడానికి సంబంధిత డేటాను సేకరించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW) కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: UP Minister: టమాటా తినడం మానేయండి.. అధిక ధరలపై యూపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఋతు పరిశుభ్రతకు సంబంధించిన జారీ చేసిన పథకాలను అమలు చేస్తున్నాయని సుప్రీం కోర్టు గుర్తించింది. “ప్రస్తుత దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ భూభాగాల్లో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా సర్దుబాట్లు చేయడానికి తగిన వెసులుబాటుతో ఏకరీతి జాతీయ విధానాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిమగ్నమైతే సముచితంగా ఉంటుందని భావిస్తున్నాము” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం రాజ్యాంగ హక్కు అయినా విద్యాభ్యాసం లేకపోవడం వల్ల పేద నేపథ్యాల నుంచి వచ్చిన 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమారదశలో ఉన్న మహిళలు విద్యను పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది వరీందర్ కుమార్ శర్మ ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్లో జయ ఠాకూర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!