Free Petrol: ఉచితంగా పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Petrol: అసలే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి. ఎంతలా అంటే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేసే అంత స్థాయికి వచ్చింది. పరిమితంగానే పెట్రోల్ పోసి ఆ తర్వాత ఆపేసారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ ఘటన జరిగింది. ఫ్రీ పెట్రోల్ అని చెప్పడంతో.. నక్కపల్లిలోని స్థానిక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం బైకులతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. తీరా అక్కడికి వెళ్లాక అసలు విషయం తెలిసి ఉసూరుమంటూ వెనక్కు వచ్చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మదినం సందర్భంగా పెట్రోలు ఫ్రీగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి రెండు లీటర్ల పెట్రోల్ చొప్పున కూపన్లను పంపిణీ చేశాడు. నక్కపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపిణీకి సిద్ధం అయ్యారు. రెండు లీటర్ల పెట్రోల్ కూపన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేయడంతో జనం వాహనాలతో భారీగా చేరుకున్నారు. 150 మందికి కూపన్లు పంపిణీ చేశారు. కాగా ఫ్రీ పెట్రోల్ వ్యవహారం ఆ నోట ఈ నోటా పాకడంతో జనం వాహనాలతో బారులు తీరారు. జనాలు ఒక్కసారిగా పెట్రోల్ బంక్కు ఎగబడ్డారు.. ఇక్కడ భారీగా రద్దీ ఏర్పడటంతో రహదారి వెంట వెళ్లే వాళ్లు ఏమి జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా చూశారు. అసలు విషయం తెలుసుకుని అక్కడికి పరుగులు తీశారు. పోలీసులు వీరిని నియంత్రించి.. ఆ తర్వాత కూపన్లను పంపిణీ చేయించారు.
Also Read
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
- Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
Read Also: Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు
150మందికే ఫ్రీగా పెట్రోల్, డీజిల్ అనడంతో ఆ తర్వాత వచ్చినవాళ్లు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతమంది జనాల్ని చూసి పెట్రోల్ బంక్ సిబ్బంది అవాక్కయ్యారు. ముందు జాగ్రత్తగా ఎస్.రాయవరం ఎస్సై ప్రసాదరావు, స్థానిక సిబ్బంది కలిసి గస్తీ ఉన్నారు. కాగా కూపన్లు అయిపోయినప్పటికీ జనాల రద్దీ తగ్గలేదు. పోలీసులు వీరిని బయటకు పంపేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!