Formula E-Car Race: ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా E కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ (IAS) అధికారులు అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది.
GST 2.O.: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలతో దేశంలోని బొగ్గు రంగానికి భారీ ఊరట
ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్, వారి ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందింది. మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. గవర్నర్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేయడం, మాజీ మంత్రిపై గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూడటం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
Javeria Abbasi: ఇంకెవరు దొరకలేదేమో.. సొంత అన్ననే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్