Venkaiah Naidu: యువతకు వెంకయ్యనాయుడు సందేశం.. రాజకీయాల్లోకి రావాలంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: ఓరుగల్లుకు ఓ చరిత్ర ఉందని, విజ్ఞాన ఖనిగా ఓరుగల్లుకి పేరుందని.. ఆ పేరు నిలబెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇష్టమైన పనిలో కష్టపడితే నష్టం లేదన్నారు. టెక్నాలజీలో భారత్ ముందుకు వెళ్తుందన్న వెంకయ్య.. రాబోయే రోజుల్లో 4వ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందన్నారు. చదువంటే నేర్చుకోవడం కాదు… ఇతరులకు నేర్పడమని ఆయన తెలిపారు.
యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. సంపద పెంచాలని, ఇతరులకు పంచాలని ఆయన అన్నారు. మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నాం.. దాని వల్ల వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రకృతిని ప్రేమించడం నేటి యువత నేర్చుకోవాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం మన సంప్రదాయాలను మనకు గుర్తు తెస్తుందన్నారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని వెంకయ్య పేర్కొన్నారు. ఇంగ్లీష్ భాష నేర్చుకోండి, ఇంగ్లీష్ సంస్కృతిని కాదన్నారు. మాతృభాష కళ్ళ లాంటిది.. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాల లాంటిదన్నారు. మమ్మి డాడీ సంస్కృతి మనకవసరమా అంటూ యువతకు సందేశమిచ్చారు. కొంతమంది వ్యక్తులు కులాలు, మతాల పేరుతో మనల్ని వేరు చేయాలని చూస్తున్నారన్నారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Read Also: Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది
ఎడ్యుకేషన్ ఒక మిషన్.. కమీషన్ కాకూడదన్నారు. క్లాస్ రూమ్ వరకే చదువు పరిమితం కాకూడదన్నారు. బాడీ బిల్డింగ్ మాత్రమే కాదు నేషన్ బిల్డింగ్ కూడా చేయాలన్నారు. ఫాస్ట్ ఫుడ్ను పక్కన పెట్టి మిల్లెట్స్ తినడం నేర్చుకోవాలని సూచించారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చన్నారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తి వంతమైందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!