Abdul Rajaq: ఇతనికి విమర్శించడమే పనా.. మొన్న ఐశ్వర్య.. ఇప్పుడు టీమిండియా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటి దూల తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు.
Karnataka: లోపం శరీరానికే మెదడుకు కాదని నిరూపించిన వికలాంగులు.. పెళ్లితో ఒకటైయ్యారు
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితంపై అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.. ప్రపంచ కప్ ఫైనల్ లో క్రికెట్ విశ్వవిజేతగా నిలిచిందని ట్వీట్ చేశాడు. స్వదేశంలోని పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకుని భారత్ గెలిస్తే క్రికెట్ కు బాధాకరమైన క్షణాలే ఉండేవని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ఈ వరల్డ్ కప్ ను టీమిండియా వశం చేసుకుంటే చాలా బాధపడేవాడినని చెప్పాడు. చివరకు.. మానసికంగా దృఢంగా ఉన్న జట్టే విజేతగా నిలిచిందన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఇరు టీమ్ లకు వాతావరణం, పిచ్ సమానంగా ఉన్నాయని చెప్పాడు. ఆ మ్యాచ్ లో ఒకవేళ కోహ్లీ సెంచరీ చేసి ఉంటే టీమిండియానే గెలిచేదని రజాక్ చెప్పుకొచ్చాడు.
Jammu Kashmir Encounter: 24 గంటలుగా ఎన్కౌంటర్.. పాక్ కీలక ఉగ్రవాది హతం..
అయితే.. రజాక్ చేసిన పోస్టుపై టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్ పై ఎంత ద్వేషం ఉంటే.. ఇలా మాట్లాడుతాడా ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ రోజు టీమిండియాకు కలిసి రాలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు. పాకిస్తాన్.. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా.. తమ క్రికెట్ ను మెరుగుపర్చుకోవాలని అంటున్నారు. లేకపోతే ఆసియా కప్ లాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుందని ఓ వినియోగదారు హితవు పలికాడు. అబ్దుల్ రజాక్ మాటల్లో కేవలం భారత్ పై ఈర్ష్య, అసూయ, అక్కసు కనిపిస్తున్నాయని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!