Grandhi Srinivas: ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా..
- భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై
- రాజీనామా లేఖను జగన్కు పంపిస్తా..
- ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతానని వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grandhi Srinivas: సార్వత్రిక ఎన్నికలైన తరువాత నుంచి వైసీపీ జగన్కు షాక్ లా మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్లు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి, తరువాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీలోని ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. గత 5 ఏళ్లలో మంత్రి పదవి వస్తుందని ఆశాభావం ఉండేవారని, కానీ మాజీ ఎమ్మెల్యే గ్రంధికి నిరాశనే మిగిలింది. ఇటీవలే జరిగిన ఐటీ రైడ్స్, అధిష్టానం నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో నిరాశ చెందిన ఆయన రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అదే రీతిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు.
Read Also: CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి
Also Read
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేరని, అందుకు తగ్గ ఆర్థిక వనరులు ప్రభుత్వం వద్ద లేవని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అమలు చేయలేరని తెలిసిన ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటూ జగన్ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు సాధ్యం కాదని తెలిసిన వాటిపైన ఉద్యమాలు ఆందోళనలు ఎలా చేయమంటారని అడిగారు. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కార్యకర్తలకు, నాయకులకు విలువ లేకుండా పోయిందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది కుటుంబ సభ్యుల లాంటి కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతానని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!