Kakarla Suresh: మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు కాకర్ల ఘన సన్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్లో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు జాతీయస్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లువెరిసింది. నాయకులందరూ బొల్లినేని వెంకట రామారావుకు శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు.
Kodali Nani: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
ఈ సందర్భంగా బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవస్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేయాలని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ను గెలిపించుకొని చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఎన్నికల వ్యూహాన్ని నాయకులు రచించాలన్నారు. వైసీపీ పార్టీని తుధ ముట్టించేందుకు టీడీపీ కార్యకర్తలు నాయకులు కంకణ బదులుగా ఉండాలన్నారు. లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందన్నారు.
CM Revanth: ప్రజా దీవెన సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్..
కనుక విభేదాలను పక్కనపెట్టి విజయం సాధించి ఉదయగిరిపై తెలుగుదేశం జెండాను ఎగరవేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకొని.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బొల్లినేని వెంకట రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన బాబు యాదవ్, మాజీ ఏఎంసి చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ సీమకుర్తి రవీంద్రబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దంతులూరు వెంకటేశ్వరరావు, యారం కృష్ణయ్య, కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం, ఉదయగిరి కన్వీనర్ బయన్న, వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, కోడూరు నాగిరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, అభిమానులు, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!