Vellampalli Srinivas: లోకేష్ చేసేది ఈవినింగ్ వాక్.. యువగళంకు ప్రజాదరణ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాడేపల్లిలో మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మల్లాదివిష్ణు, దేవినేని అవినాష్ లు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా వెలంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ లేదని ఆరోపించారు. కొడుకు పాదయాత్రకు ప్రజాదరణ లేదని తెలుసుకున్న బాబు, పవన్ కళ్యాణ్ తో వారాహి యాత్ర చేయిస్తున్నాడని విమర్శించారు. యాత్రలో భాగంగా పవన్ మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కావన్నారు. పొంతన లేని మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా.. వృద్ద తండ్రి చంద్రబాబు కూడా యాత్రలు చేస్తున్నారని విమర్శనాస్త్రాలు గుప్పించారు.
Madhyapradesh: పెంపుడు కుక్క కోసం గొడవ.. భార్యాపిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ హిందూ ద్రోహులని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ, జనసేన వాళ్లకి జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకి లోకేష్ చేసే పాదయాత్ర పై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో పోటీ చెయ్యగలరా అని సవాల్ విసిరారు. ప్రజాబలం ఉంటే అన్ని స్థానాలలో పోటీ చేయండని తెలిపారు. లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
మరోవైపు ఆర్యవైశ్యులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లంపల్లి మండిపడ్డారు. ఆర్యవైశ్యలను అన్ని రకాలుగా ఆదుకుంటుంది జగనన్నే అని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకి మేలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. పొట్టి శ్రీరాముల ని అవమానించింది చంద్రబాబు.. గౌరవించింది జగన్ అని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులపై మీ కపట ప్రేమలు పనికిరావని తెలిపారు. ఇక సినిమాలు, రాజకీయాలలో పవన్ కల్యాణ్ జీరో అన్నారు. సీఎం జగన్ ను ఏకవచనంతో దుషిస్తే సహించేది లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!