Niranjan Reddy: ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్లో జోకర్గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు.. నిర్ధారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేసి మూసీ నదిలో వేస్తే.. సీఎం, మంత్రులు ఈదుకుంటూ వెళ్లి తీసుకువస్తారా? అని దుయ్యబట్టారు. ఇందిరా గాంధీ సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనీ ఆరోపణలు ఉన్నాయని.. అది కాన్ఫెషన్ స్టేట్మెంట్.. ఎవిడెన్స్ కాదు అని అందరికీ తెలుసని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
Sithara Ent: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలోనూ అదే ఫాలో అవుతున్న నాగవంశీ!
Also Read
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
- Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని విమర్శించారు. లైవ్ లో దొరికిన రేవంత్కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించారు. కేసీఆర్కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్ మాట్లాడడం అవివేకం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వారిని అలా మాట్లాడతారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..
మరోవైపు.. రాష్ట్రంలో కరెంటు, నీళ్ళు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ మీద తల తోక లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన వరికి బోనస్.. బోగస్ మాత్రమేనని విమర్శించారు. ఇచ్చిన బోనస్ ఏంటి అంటే.. రైతుల మీద లాఠీ ఛార్జ్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు లేక రైతులు ఇబ్బందులు పడలేదని.. కాంగ్రెస్ నేతలకు పాలన దక్షత ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలని నిరంజన్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
-
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
-
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
-
Main Wapas Aaunga: హైదరాబాద్ థియేటర్లలో ‘మైన్ వాపస్ ఆవుంగా’ డైరెక్టర్
-
Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!